Monday, March 29, 2010

bharatam gutinchi

                            గణపతి స్తుతి
అంకముచేరి శైలతనయాస్తన దుగ్దములానువెళ బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలిచన్ గబలింపబోయి యా
వంక కుచంబుగాన కహివళ్ళభ హారముగాంచి వే మృణా
లాంకుర శంక నంటెడు గజాస్యునిగొల్తు నభీష్టసిద్ధికిన్
ఇది అల్లసాని పెద్దన విరచితమైన మనుచరిత్ర ప్రతమశ్వసములోని నాలుగవ పద్యము
మహాభారతం గురించి రాస్తానని మనుచరిత్ర పద్యం ఏంటి అనుకుంటున్నారా ?ఇది నాకు ఇష్టమైన పద్యం .సంస్కృత శ్లోకం కన్నా సంస్కృత పదాలతో రాసిన తెలుగుపద్యం తో గణేషుని స్తుతిస్తే బాగుంటుందని తోచింది .ఇకనుంచి మీరుకూడా శుక్లాంబరధరానికి మారుగా పైన చెప్పిన పద్యంతో గణపతి ప్రార్థన చెయ్యండి .ఏందుకంటే సంస్కృత శ్లోకం గణపతిని మాత్రమే స్తుతిస్తే తెలుగు పద్యం గణపతిని అర్ధనారిశ్వరుడైన శివుని ,(అంటే అంబా సమేతుడైనశివుడు)శివ హరమైన సర్పాన్ని ప్రార్థించి్నట్లవుతుంది .
అంతేకాదు ,ఓమహా గణపతి నీవు బాల్యంలో తామర తూడని భ్రమించి సర్ప హారాన్ని ఏవిదంగా పట్టుకున్నవో అదేవిదంగా భ్రమలోమేము చేసే పొరపాట్లను మన్నించి మాకార్యలను నిర్విఘ్నం చెయ్యి అని వేడుకున్నట్లవుతుంది.
                                     తెలుగు గ్రంథంలో సంస్కృత శ్లోకం    
శ్రీ వానీగిరిజాశ్చిరాయ దధతో వక్క్షో ముఖాన్గేషుయే
లోకానాం స్థితి మావహంత్య విహతాన్ స్త్రేపున్సయోగోద్భావాన్
తే వేదత్రయ ముర్తాయ స్త్రిపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయసు:పుశోత్తమాంభుజభవ శ్రీ కందరా శ్రేయసే
ఇది తెలుగు మహా భారతంలోని తొలి శ్లోకం. శ్లోకం అంటే సంస్కృతమని మళ్లీచెప్పాల్సిన అవసరం లేదు .భాష మాత్రమే కాదు .యతి ప్రాస నియమాలుకుడా సంస్కృత సాంప్రదాయానుసారముగానే వదిలివేయబడ్డాయి .కావ్యాన్ని
"మ" గణం తో ప్రారంభించడం మంగలకరం
ప్రారంభన లోనే త్రిమూర్తి ప్రార్థన చేయడం నన్నయ క్రాంత దర్శనమునకు నిదర్శనం .మహాభారత రచన ముగ్గురిచేతుల మీదుగా పూర్తవుతుందని సూచించాడేమో.రుశివంటి నన్నయ రెండవ వాల్మికి అని విశ్వనాథ అన్నాడు

నన్నయ శబ్దం నారాయణ శబ్ద భావం :తిక్కన కవి బ్రహ్మ : ఎర్రన శంభు దాసుడు

త్రిమూర్తుల స్తుతితో ప్రారంభమైన భారతం కవిత్రయం చేతులమీదుగా పూర్తయింది .ఇది ఈ పద్యం ప్రత్యేకత
                                             నన్నయ కవితా లక్క్షనాలు
సారమతిం కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలో
నారసి మేలునా .నితరులక్క్షర రమ్యత నాదరింప ,నా
నా రుచిరార్త సూక్తినిది నన్నయ భట్టు తెనుంగునన్ మహా
భారత సంహితా రచన భండురుదయ్యే జగద్ధితంబుగన్
౧)ప్రసన్న కథా కలితార్థ యుక్తి
౨) అక్క్షర రమ్యత
౩)నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం
పైన చెప్పిన మూడు నన్నయ కవిత్వంలో కనిపించే ప్రధాన లక్క్షనాలు
క్రొత్తగా ఇల్లు కట్టించుకోవాలనుకునేవాడు తనింట్లో ఏర్పాటు చేసుకునే సౌకర్యాల గురించి ప్రణాలికలు వేసుకుంటాడు .
అన్ని నేర్వేరుతయ అంటే "హోటలుకు వెళ్లి పెసరట్టు ఆర్దరిచ్చినట్టే "తానడిగింది ఒకరకం పెసరట్టు వాదిచ్చింది మరోరకం పెసరట్టు .
నన్నయ రచన అలాన్టిదికాడు .తన రచనలో చుపుతానన్న గుణాలు చుపితీరాడు .
ఎ)ప్రసన్న కథా కలితార్థ యుక్తి :-మహా భారతంలో ఉపాఖ్యానాలు చాల ఎక్కువ .ఉపాఖ్యానాలు ఆఖ్యానానికి అడ్డుతగలకుండా ఆరెంటినడుమ వుండే సంబంధాన్నితెలిపి కథను ప్రసన్నం చేసేది. దీనికే
ప్రసన్న కథా కవితర్థ యుక్తి అని నామాంతరం.ఇది లోనారసి తెలుసుకొనే కవితగుణం సాహిత్యం ఆలోచనామృతం .తరచిచూసినాకొద్ది కొత్త కొత్త అర్థాలు భావాలు స్ఫురిస్తాయి ఈ ఆలోచనామ్రుతత్త్వానే నన్నయ ప్రసన్న కథా కలితార్థయుక్తి అన్నాడేమో అనిపిస్తుంది .ఇది కవీంద్రులు లోనారసి తెలుసుకునీ గుణం .
నన్నయ కథను చాలారకాలుగా ప్రసన్నం చేసాడు ఆయా పద్యాలూ చూసేప్పుడు పరిశీలిద్దాం.
బి) అక్క్షర రమ్యత :-అక్క్షరమ్ అంటే నాశనం లేనిది అని .రమ్యత అంటే సుందరమైనది అని .అందం, సౌందర్యం నశించేవికావు. ఇవి చూడగానే ఆట్టే మనసును ఆకర్షించి నిలిపివుంచేవి .అందాన్ని ఆస్వాదిన్చాలిఅంటే ఆట్టే పాండిత్యం అవసరంలేదు . కవీంద్రులు కానివారు(ఇతరులు) సహితం ఆనందించే కవితా గుణం .
సి) నానా రుచిరార్థ సుక్తినిధిత్వం :రుచిరమంటే రోచస్సు అన్టేకాంతి, వెలుగు సూక్తి అంటే సుష్టం ఉక్తం అని
స్తూలంగా చెప్పాలంటే మంచిమాట (సు +ఉక్తి) నన్నయ కవిత్వంలోని పద్యాలు సూక్తులు కావు ఆపద్యాల అర్థాలు తమ తేజస్సుతో సుక్తుల్ల భాషిస్థాయి .నన్నయ కవిత్వంలో సూక్తులు కథనుండి విడివడి నీతిపద్యాల్ల కనిపిస్తాయి .ఆపద్యలన్నింటిని ఏరి ఒకచోట రాస్తే నిర్మకుట నీతిశతకములా కనిపిస్తుంది.
నన్నయ తన కవిత్వ లక్క్షనాలుగా చెప్పిన వాటిని ప్రతిజ్ఙగా భావించి నెరవేర్చాడు

.

maha bharatam lokanipinche brahmana swaroopam

మహా భారతలో కనిపించే బ్రాహ్మణ స్వరూపము మేడిశెట్టి రవిచన్ద్ర తెలుగు పండిత్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల గ్రా:మార్చాల , జిమహబూబ్ నగర్
ప్రాచీన భారతీయ సమాజంలో బ్రాహ్మణులకు ప్రాదాణ్యత అధికం.తెలుగులో ఆదికావ్యమైన మహాభారతంలో ప్రకటితమైన విషయాలను గమనిస్తే ఆవిషయం ప్రస్పుటమౌతుంది.నిజంగా బ్రాహ్మణుడు భూసురుడేనా?అతనికి శాపానుగ్రహణ శక్తిఉందా?అనేవిశయాలు అప్రస్తుతాలు..ప్రస్తుతం అవాస్తవాలు.ఐతే ఒకకాలాన్ని మరోకాలపు దృష్టితో చూస్తే అంతా అయోమయంగానే అనిపిస్తుంది.మాతాత పుడుతూనే ముసలివాడు అన్నట్లుంటుంది.అసలుబ్రాహ్మణుడంటేఎవరు.?అనేప్రశ్నకు సమాధానం మొదలు తెలుసుకోవాలి.అప్పుడు విషయం బోధపడుతుంది.
చాతుర్వర్ణ్యం మయాసృష్ట్యా గుణకర్మవిభాగసః అనిగీతాకారుడన్నాడు.పుట్టుకతో ఎవరూ ఏమీకారు.,వారివారిగుణ కర్మలననుసరించి చాతుర్వర్ణాలు సృష్టించాను అని భావం.విద్యనేర్చినవాడు విప్రుడు వీర్యముండినవాడు క్షత్రియుడు అన్న గురజాడమాటలు గీతావాక్యానికి వ్యాఖ్యానప్రాయంగా నిలుస్తాయి.
ఆకాలంలో విద్య నేర్చినవాడు  బ్రాహ్మణుడు మాత్రమే కాబట్టి, విద్వాన్ సర్వత్ర పూజ్యతే కాబట్టి పూజించబడ్డాడు అంతే.
బౌద్ధ జైన మతాలప్రాబల్యంనుండి అప్పుడప్పుడే బయట పడుతున్న భారతీయ స్దమాజానికి మళ్ళిహైందవమే ఆరాధ్యమైంది.భగవమ్తునికి ప్రతినిధిగాఉండి పూజలందించడమే కాకుండా.జాతక కర్మ మొదలుకొని అపరకర్మలవరకుఅన్నీ ముందుండి జరిపించే బ్రాహ్మణుడు పూజనీయుడైనాడు.అందనంత ఎత్తున అతని స్తానం ఏర్పాటుచేయ బడింది.ఆఎత్తును బేరీజువేసెప్రయత్నమే ఈవ్యాసం.
భారతాన్ని తెనుగున రచింపమని రాజరాజు నన్నయను కోరడంలో భాషాభిమానంకన్నా మతాభిమానం అదికమనిపిస్తుంది.ఇతర భాషలలో ఆనాటికే ఉద్భవమందిన సాహిత్యం జైన బౌద్ధమతాల పాదునుండిఉధ్భవమందిందే.వైదికమతాభిమానిఐన రాజరాజుకిది నచ్చలేదు.అందుకే తనువినాలనుకున్న తనపూర్వులచరిత్రరచనకు నన్నయనుఎన్నుకున్నాదు.
(ఆదిపర్వము ప్రథమాశ్వాసము ౯వ పద్యం "తనకుల బ్రాహ్మణు.......కరుణతోడ" ఆదారంగా)
నన్నయ విపుల శబ్దానుశాసనుడు,సంహితాభ్యాసుడు,బ్రహ్మండాది నానాపురాణ విజ్ఞాననిరతుడు,ఉభయభాషాకావ్య రచనా శొభితుడు. ఐనప్పటికి రాజరాజు కుల బ్రాహ్మణుడుకావడముచేతనే మహాభారత రచనావకాశం లభించింది.(వాగనుశాసనుడైన నన్నయ మరోలా మొదలు పెట్టలేకకాదు "తనకుల బ్రాహ్మణు "అని మొదలు పెట్టింది .తను బ్రాహ్మణుడుకావడం వల్లనె నానా పురాణ విజ్ఞాననిరరుడుకాగలిగాడు,అందుకే ఉభయ భాషారచనా కోవిదుడుకాగలిగాడు.అందుకేమహాభారత రచనావకాశం లభించింది. అందుకే ఆపద్యాన్ని తనకుల బ్రాహ్మణు అని మొదలు పెట్టాడు.ఇదే ప్రసన్నకథా కళితార్థయుక్తి.
ఇంతకి రాజరాజు మహాభారతమే ఎందుకు వినాలనుకున్నాడు.పాండవులు తనపూర్వికులు కనుకేనా.అంత మాత్రమేకాదు,అమల సువర్ణశృంగకురమై కపిలంబగు గోశతంబు ఉత్తమ బహువేదవిప్రులకు దానంచేస్తే ఎంతఫలం వస్తుందో ,మహాభారతం వినడంవల్ల అంతఫలితం వస్తుందట.అదికే భారతం వినాలనుకున్నాడు.అదీసంగతి.
ఇక కథలోకి వస్తే !
మహా భారతంలో మొదట కనిపించే కథ ఉదంకోపాఖ్యానం.ఇది పూర్తిగా సంకేతాత్మికమైంది. అక్షరాక్షరం  ప్రసన్న కథాకలితార్థయుక్తితోకూడుకున్నది.
ఆకథను ప్రసన్నం చేయడానికి ఇది వేదిక కాదు కాని ,దానిలోగల బ్రాహ్మణత్వాన్ని పరిశీలిద్దాం.పౌశ్యోదంకులు శాపప్రతిశాపాలు ఇచ్చుకున్న తర్వాత పౌశ్యుడు తనకు శాపాన్ని ఉపసంహరించేశక్తిలేదని చెప్పిన నిండుమనంబునవ్యనవనీతసమానముఅనే  పద్యంలో నన్నయ ఉదంకునిరూపంలో అందనంత ఎత్తునుంటే,  వినమ్రంగా చేసులుముడుచుకొని తలవంచుకొని నిలబడ్డ పౌశ్యునిలో రాజరాజు కనిపిస్తాడు.
                                   *           *                 *
నీవతి కౄరుడవు సర్వ భక్షకుడవు కమ్మని శపింఇన బృగువుతో అగ్ని......

అడచిన దిట్టిన మహాపరుషంబులు పల్కి యల్కతో
బొడిచిన నుత్తమద్విజులు పూజ్యులు వారలకెగ్గుసేసినం
జెడునిహముంపరంబు సిద్ధంబుగావుటెరింగి భక్తి నె
ప్పుడు ధరణీసురోత్తముల బూజలదన్పుదు నల్గనోడుదున్     అంటాడు.
పై పద్యంలో చెప్పింది అగ్నిదేవుని అభిప్రాయం కాదు రాజరాజు అభిప్రాయం.\
గొంతుదిగని బ్రాహ్మణుడు
 మాతృదాస్య విముక్తికొరకు బయలుదేరిన గరుత్మంతుడు తనజు ఆహారం ప్రసాదించమని తల్లిని వేడుతాడు.అడిగాడుకాబట్టి ఆయమ్మ తనకుమారునికి ఆహారం చూపింది,ఏమిటి ఆ ఆహారం?సముద్రంలో అసంఖ్యాకంగాఉన్న నిషాదులను ఆహారంగా పరిగ్రహించమని చెప్పింది.పొరపాటునకూడా బ్రాహ్మణున్ని తినవద్దంది.పాపం నిషాదులు చేసిన పాపం ఏమిటి? విషనిదినున్న నిషాదులు ధారుణి ప్రజను విషమము చేస్తున్నారట.అందుకని వారిని తినమన్నది.
సరేగాని గరుత్మంతుడు అయోమయంలో పడిపోయాడు.బ్రాహ్మణూల్ని గుర్తించడమెలా?అదేవిషయం తల్లినడిగాడు. దానికి ఆయమ్మ ఇలా చెప్పింది.
రయమున మ్రింగుడు గాలము
క్రియ నెవ్వడు కంఠవిలము క్రిందికి జనక
గ్నియ పోలె నేర్చుచుండును
భయరహితా వానినెరుగు బ్రాహ్మణకులుగాన్ (ఆది ద్వి ఆ ౮౧)
ఎవరిని మ్రింగితె గొంతుదిగకుండా అడ్డుపడి అగ్నిలాకాలునోఅతనే బ్రాహ్మణుడు.అలాంటివాన్ని మింగకూడదని చెప్పి,ఇంకా ఇలా అంటుంది.
వినత చెప్పిన బ్రాహ్మణ స్వరూపం
 బ్రాహ్మణున్ని ఎలా గుర్తించాలొ చెప్పిన వినత అంతటితో ఆగలేదు.బ్రాహ్మణున్ఇ ఎందుకు ఆహారంగా స్వీకరించకూడదో కూడా వివరించింది.
కోపితుండైన విప్రుడు ఘోరశస్త్ర
మగు మహావిషమగు నగ్నియగు నతండ
యర్చితుండైన జనులకు నభిమతార్థ
సిద్ధి కరుడగు గురుడగు  చెయుప్రీతి (ఆది ద్వి ఆ ౬౨)
ఆందుకే బ్రాహ్మణున్ని పూజించాలి ,కాని మ్రింగకూడదు.
        ఇంగువ కట్టిన గుడ్డ      
సరే గరుత్మంతుడు బయలు దేరాడు.సముద్రగర్భంలోనున్న నిషాదులందరిని ఒక్క పెట్టున మ్రింగాడు.అందులో ఒక్క బ్రాహ్మణుడుండి గొంతుకు అడ్డుపడ్దాదు .వైనతేయునికి తల్లిమాటలు జ్ఞప్తిజివచ్చాయి.నాగొంతులో ఎవరినా బ్రాహ్మణుడుంటే బయటికిరావలసిందని ప్రార్థించాడు.
విప్రుడనున్నవాడ,నపవిత్ర మదీయభార్య కీ
       ర్తిప్రియ !దీనిబెట్టి చనుదెంచుట ధర్మువెనాకు?     అని సమాధానం వచ్చింది
ఆహా ఈబ్రాహ్మణుడెంత ధర్మపరుడు.తన భార్యతోపాటు తానుకూడ నా జఠాగ్నిలోపడి పతీసహగమనం చేద్దామనుకుంటున్నాడని చింతించి,
విప్రుల బొందియున్న యపవిత్రులు బూజ్యులుగారె కాదునన్
విప్రకులుండ వెల్వడుము వేగమ నీవును నీనిషాదియున్   (ఆది ద్విఆ ౬౪)
అని వారికి  స్వేచ్ఛను ప్రసాదించాడు.ఇంగువకట్టిన గుడ్డకు వాసన వెసినట్లు బ్రాహ్మణుని(జ్ఞానిని) పొందియున్న అపవిత్రులు(అజ్ఞానులు)సహితం పుణ్యాత్ములవుతారట!అందుకే విప్రుని భార్యయైన నిషాదికి విముక్తి లభించింది.
నిర్మానుష్యం కానక్కరలేదు 
     మొత్తానికి గరుత్మంతుడు నిషాదులను ఆహారంగాస్వీకరించి బయలుదేరాడు,కాని ఆకలితీరినట్టులేదు.తండ్రిఐన కశ్యపుని దగ్గరకు వెళ్ళాడు,నమస్కరించాడు,నిషాదులను తినడంవల్లనాకు ఆకలి తీరలేదు,నాకు ఆహారాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు.కొడుకు కడంకకు మెచ్చి గజకూర్మ రూపాలలోనుండి అర్థనిమి్త్తంపోరుచున్న విభావసుడు,సుప్రతీకుడు అను సోదరద్వయాన్ని ఆహారంగా పరిగ్రహించమని ఆదేశిస్తాడు.
గజ కూర్మాలను చెరోచేత్తోపట్టుకొని ఆకాశంలోకి ఎగిరిన గరుత్మంతుని అలంబన తీర్థంలోని శతయోజనవిస్తీర్ణంగల రోహనంబను వృక్షం తనపై కూర్చొని వాటిని ఆరగించమని కోరుతుంది.గరుడూని భారాన్ని మొయలేక తరుశాఖ విరిగిపోతుండగా,దాఇఆదారంగా తపస్సు చేసుకుంటున్న వాలాఖీల్యులను చూసి,ఆశాఖభూమిని తాకిన వారికి బాధకలుగునని ఆకొమ్మను పట్టుకొని తండ్రివద్దకి వెడుతాడు.కశ్యపుని ప్రార్థనతో వాలాఖిల్యులు ఆతతుశాఖ వీడి హిమవన్నగ ప్రాంతానికి వెలతారు.
మునిజన రహితంబైన ఆతరుశాఖను ధరిణీసుర విరహితంబైన చోట వదిలివేస్తానని,అలాంటిచోటు చూపుమనగా,హిమశైల కందర భాగమున నిష్పురుషనగముకలదు అచ్చటవదిలి వేయమని చెపుతాడు కశ్యపుడు.
  ఆ శాఖ వదలి అమృత హరణార్థంవెలుతాడు గరుడుడు  (ఇందులో ఏదోలోపించినట్లనిపిస్తుంది )
            శర్మిష్ట _దేవయాని
రాజెక్కువా? మొండెక్కువా? అంటే  మొండే ఎక్కువ అని సామెత.మొండేకాదు బ్రాహ్మణుడుకూడా రాజుకన్నా అదికుడే.ఒక్కమటలో చెప్పాలంటే చరాచర జీవరాసిలో బ్ర్మాహ్మణుడే అధికుడు.ఆ ఆధిక్యానికి కారణం అతనివిద్యే.ఆవిశయాన్ని స్పష్టంచేసే ఉపాక్యానమే శర్మిష్ట దేవయాని.
శర్మిష్ట వృషపర్వుడానే దానవరాజు కూతురు.వారికులగురువు శుక్రాచార్యుని కూతురు దేవయాని.శర్మిష్ట ,దేవయానులిరువురు క్రీడాసఖులు.వీరొకనాడు చెలులతోకలసి క్రీడార్థమై  వనమునకేగి అందొక సరోవర తటమున పుట్టంబులబెట్టి జలక్రీదలాడుచుండగా సురకరువలిచే వస్త్రాలన్ని కలసిపోగా దేవయాని వస్త్రాలు శర్మిష్ట కట్టుకుంటుంది,కాని శర్మిష్ట వస్త్రాలు దరించనిరాకరించిన దేవయాని
లోకోత్తర చరితుడగు
నాకవ్యు తనూజ నీకునారాధ్యను నే
బ్రాకట భూసురకన్యక
నీకట్టిన మైలకట్ట నేర్తునె చెపుమా (ఆది తృ ౧౩౫)
అని అంటుంది.దీనికి కోపించిన శర్మిష్ట
మాయయ్యకు బాయక పని
సేయుచు సేవించి ప్రియము సేయుచు నుండున్
మీయయ్య యేటిమహిమలు
నాయొద్ద పలుకనీకునాయములేదే(ఆది తృ ౧౩౭)
అనితిట్టి దేవయానిని నూత పడదోసి వెళ్ళిపోతుంది .
యయాతిరావడం దేవయానినుద్దరించడం వేరుసంగతి,అసలు సంగతి చారులద్వారాతెలుసుకున్న వృషపర్వుడు శుక్రాచార్యునిదగ్గరకువచ్చి
నమస్కరించి ఇట్లా అంటాడు.
దేవతలన్ జయించుచు నతిస్థిర సంపదలంద్వదీయవి
ద్యావిభవంబు పెంపున దానవు లుద్దతులైరి;కానినా
డీవనరాసిలో జొరరె యింతకు నంతక కోపులైన య
ద్దేవతాకినీపతుల దివ్య నిశాత మహాయుదహతిన్ (ఆది తృ ౧౫౧)

వరణ ఘోటకభాండా
గారంబులు మొదలుగాగ గల ధనములతో
సూరినుత!యిందరము నీ
వారకములుగాగ మమ్ము వగవుము బుద్దిన్ (ఆది తృ ౧౫౨)
ఈ దేవయానికేదిష్టమో దానినిస్తాను అడగమంటే,కన్యాసహస్రంబుతో శర్మిష్ట నాకుదాసి కావాలి అని దేవయాని కోరుతుంది.దానికివడంబడి వృషపర్వుడు తనకూతురిని దేవయానికి దససిగ అప్పగిస్తాడు.
ఈకానుక శుక్రాచార్యుని విద్యా విభవానికి దాసోహమని ఇచ్చిందే కాని మరొకటికాదు.

sirisiri muvva shatakam prachinakavya laxanaalu

                                                                                                           మేడిశెట్టి రవిచన్ద్ర
                                                                                                           తెలుగు పండిత్
                                                                                                        జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల
                                                                                                     గ్రా:మార్చాల , జిమహబూబ్ నగర్                                                                                            
శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాస రావని కొత్తగాచెప్పాల్సిన అవసరంలేదు,కాని సిప్రాలి అంటే ఏమిటి?అని అడిగే సాహిత్యేతర మిత్రులు అడపాదడపా కనిపిస్తూనేఉంటారు.
      శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ అయినట్టే
        సిరిసిరి మువ్వ శతకం
        ప్రాసక్రీడలు
        లిమరుక్కులు
     మూడింటిమొదటి అక్షరాల కలయికే సిప్రాలి అయింది.
      శ్రీశ్రీగారి సిప్రాలి రాసింది,ప్రచురించింది అమెరికాలోనే(1981).50ప్రతిలు స్వదస్తూరీతో మిమియోగ్రాఫ్ తీసి ,కాపీ 10డాలర్ల చొప్పున అక్కడికక్కడే అమ్మెసారట

                                                   (శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం 14వ భాగం మనవిమాటల్లో చలసాని ప్రసాదరావుగారు)


    ఛందోబంధోబస్తులన్నీ తెంచేసుకున్న శ్రీశ్రీ గారు ఛందస్సుతో ఓశతకం రాయడం వింతగా అనిపిస్తున్నా,వారు తన సాహితీ ప్రస్తానాన్ని పద్యాలతోనే ఆరంభించారు.

                  సాయంప్రస్ఫుట రాగరంజితలసస్సంపూర్ణ సౌదర్య రా

                  శీ యుక్తామల దివ్య సౌందర్య మూర్తివయి సాక్షీభూత నానామరు

                  త్తొయస్తోత్ర గభీర రస సంతుష్టాంతరంగంబునన్

                  మాయామేయ జగద్వినాశమతిన్ నర్తింపుమాశంకరా

                  అనే పద్యంగాని

               గాలియొసగెడు కొత్త రెక్కలధరించి

               అతినిరాఘాటముగ విహాయపథాల

              నెరుకపడరానియెచటకొ ఎగిరిపోదు

     అనే భావగీతంగాని శ్రీ శ్రీ రాసారంటే నమ్మశక్యంకాదు.ఇలాంటిరచనలు సుమారు 1929 వరకు చెసారు.1930లో టైఫాయిడ్ జ్వరమునుండికోలుకున్న తర్వాత పంథామార్చుకున్నారు.అంతవరకు తనను నడిపించిన తెలుగు సాహిత్యాన్ని తానునడిపించడం మొదలుపెట్టారు.తెలుగు కవిత్వాన్ని నూతనమార్గంపట్టించారు.మహాప్రస్తానం సాగించారు .ఖడ్గసృష్టిచేసారు.
    తిరిగి చరమదశలో పద్యరచన మొదలుపెట్టి ,తన ఎనిమిదవ ఏటనే పొట్టి పొడుగుపాదాలతో రాసి వదిలేసిన కందాలను తిరిగి చేపట్టి ,వాటికి కొత్తసొగసులద్ది ,సిరిసిరిమువ్వ శతకం రాసారు.
   కందం అంటే
  తిక్కన,చౌడప్ప, శ్రీశ్రీ అంతే!.కందం రాస్తేనేకవి అనేమాట్ ఎలాఉన్నా,సిరిసిరిమువ్వ శతకం చదివాక శ్రీశ్రీ రాస్తేనేకందమనిపించకపోదు.
                 తిక్కన కందంలో భారతకథ ఉంటే
                 చౌడప్ప కందంలో బూతిలు ,నీతులు ఉన్నయి
                 శ్రీశ్రీ కందంలో లోకరీతులున్నయి
     సిరిసిరిమువ్వ శతకాన్ని పరిశీలిస్తే అభ్యుదయభావాలు,ఆడునిక విషయాలు కనిపిస్తున్నా, రచనమాత్రం ప్రాచినపంథాలోనేసాగింది
  శ్రీశ్రీ ప్రకృతి ఐతే సిరిసిరి వికృతి
  సిరిసిరి మువ్వ శతకంలో 11 భాగాలున్నయి .నిజానికి శ్రీశ్రీ వాటిని భాగాలనలేదు.అవసరమనిపిస్తే ప్రత్యేక శీర్శికలుంచాడు, లేకపోతె ఒకటి,రెండు అని పొడి అక్షరాలతో సూచించడు.
          బాల్యంలోవదిలేసిన పద్యరచనను తిరిగి ప్రారంభిస్తూ
              మళ్ళీ ఇనాళ్ళకి ఇ
              న్నేళ్ళకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్
              పళ్ళూడిన ముసిలిది
              కుచ్చిళ్ళు సవరించినట్లు  సిరిసిరి మువ్వా !
    అని జ్ఞాపకాలను సవరించుకున్నారు.

  సిరిసిరిమువ్వ శతకాన్ని పరిశీలిస్తే అభ్యుదయభావాలు,ఆడునిక విషయాలు కనిపిస్తున్నా, రచనమాత్రం ప్రాచినపంథాలోనేసాగింది
  శ్రీశ్రీ ప్రకృతి ఐతే సిరిసిరి వికృతి
  సిరిసిరి మువ్వ శతకంలో 11 భాగాలున్నయి .నిజానికి శ్రీశ్రీ వాటిని భాగాలనలేదు.అవసరమనిపిస్తే ప్రత్యేక శీర్శికలుంచాడు, లేకపోతె ఒకటి,రెండు అని పొడి అక్షరాలతో సూచించడు.
          బాల్యంలోవదిలేసిన పద్యరచనను తిరిగి ప్రారంభిస్తూ
              మళ్ళీ ఇనాళ్ళకి ఇ
              న్నేళ్ళకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్
              పళ్ళూడిన ముసిలిది
              కుచ్చిళ్ళు సవరించినట్లు  సిరిసిరి మువ్వా !
    అని జ్ఞాపకాలను సవరించుకున్నారు.
   తిక్కనకు హరిహరనాథుడి కలలో శ్రీశ్రీకి చక్రపాణిగారు కలలోకనిపించి ,ఒకశతకం రాసి తనకంకితకీయమని అడిగాడట .శతకకన్యను పుచ్చుకొని కన్యాశుల్కంగా ఒక సిగరెట్టిస్తానన్నాడట .

       నీకో సిగరెట్టిస్తా
       నాకో కావ్యమ్ము రాసి నయముగనిమ్మా
       త్రైకాల్య స్థాయిగ నీ
       శ్రీకావ్యము వరలునోయి సిరిసిరి బాయీ !      అన్నారట
     ఇంకా
  
       నీలాంటివాళ్ళతోనే
       ఈలోకం ముందిముందుకేగునుసుమ్మా
       ఆలస్యం ఎందుకిక?నీ
       క్ష్వేలారుతమందుకొనుము  సిరిసిరి నేస్తం     అని ప్రేరేపించాడట
   సంపాదక సాక్షాత్కారం అనే ఈ రెండవ భాగాన్ని ప్రాచిన కావ్యాలలోని అవతారికతో పోల్చవచ్చు. శ్రీశ్రీది భారద్వాజస గోత్రమట.
    ఈ రెండవభాగంలోమాత్రం మకుటనియమోల్లంగన జరిగింది .సిరిసిరి మువ్వా ,సిరిసిరి  మురళీ ,సిరిసిరి మౌనీ
.సిరిసిరి బాయీ ,సిరిసిరి గాగూ ,సిరిసిరి నేస్తం ,సిరిసిరి రావూ  అనేవి మకుట స్థానంలో కనిపిస్తాయి
  ఈమకుట నియమోల్లంగనానికి శ్రీశ్రీ ఆద్యుడుకాడు.తొలి తెలుగు శతకముగా చెప్పబశుతున్న శివతత్వసారంలో కూడాఇదికనిపిస్తుంది  శివతత్వసారంలో శివా,అజా,రుద్రా,మహేశా అనే మకుటాలు కనిపిస్తాయి
   సంపాదక సాక్షాత్కారం అనే రెండవ భాగం దాదాపు ప్రథమ పురుషలోనే సాగింది .ఇదికూడా ప్రాచిన కావ్య సాంప్రదాయమే. నన్నయను రాజరాజ నరేంద్రుడు  ,అల్లసాని వారిని రాయలు పొగిడిన పద్యాలు ప్రథమ పురుషలోనేఉన్నాయి.
  ఇక మూడవ భాగంవిషయానికొస్తే ఇది ఇష్టదేవతాప్రార్థన అనే శీర్శికతో కనిపిస్త్తుంది.ఐతే  శ్ర్తిశ్రీ గారు ఏదేవునీప్రార్థించలేదు.కనీసం దేవునిపేరైనా ఎత్తలేదు.పూర్వకవి స్తుతిచేసాడంతే.
  దీనిని  పూర్తిగా పూర్వ కవిస్తుతిగా కూడా చెప్పలేము .ఎందుకంటే కవులతోపాటు .ఆయాకవుల చేసృష్టించబడ్డ పాత్రలుకూడాకనిపిస్తాయి.
   తెనాలి రామకృష్ణుని ,చౌడప్పను, కూచిమంచి జగ్గకవిని, కృష్ణశాస్త్రిని,వేమనను,జరుక్ శాస్త్రిని ,
  శ్రీనాథుని  టిట్టిభశెట్టిని ,గురజాడ గిరీశాన్ని .పానుగంటి జంగల శాస్త్రులను తలచుకున్నాడు .
  వారంతా వ్యంగ్యంగా సమాజాన్ని, సమాజంలోని లోపాలను ఎత్తిచూపిన కవులు,పాత్రలు    
   శ్రీరంగ నీతులు,వైరాగ్యపద్దతి,మూర్కపద్దతి,కుకవినింద,ఉపాలంభనం.చాటువులు అనేవి మిగిలిన భాగాలు.
 కుకవినిందకూడ ప్రాచినకావ్యాలలో కనిపించేదే.ఈ భాగంలో శ్రీ శ్రీ ఎవరినీ పేరెట్టి నిందించలేదు పైగా
        నాకెమో లోకంలొ
        కాకవులే కానరారు కవిదూషణ  న
        న్నాకర్షించదు ,రచనో
        త్సేకాన్నే మెచ్చుకొందు సిరిసిరిమువ్వా !  అన్నాడు .అంటూనే...
  
        బండెడుచెత్తను ఛంద
       శృండముగా  పోగుచేసి సారస్యము చూ
       డండని రంకెలువేస్తే
       చెండాడెద నట్టివారి సిరిసిరిమువ్వా!    అని వార్నింగిచ్చాడు.
  
      కుకవియన నామతంలో
      ఒకడే ,తనగొప్ప యెదిరిన్యూనత  చూసే
      వికలమతి ,వానిపై నా
      చికటారిని నూరదలతు సిరిసిరిమువ్వా !  అని సూటిగా చెపాడు .

ఉపాలంభనం పేరుతో ఉపసం హారముంది
  దెన్నైతే పూర్వంకా
  దన్నామో,రాక్షసత్వమని యెంచామో
  దాన్నేఆరాధిస్తే
  చిన్నతనం వేరెకలదె సిరిసిరిమువ్వా!అనివాపోతాడు శ్రీశ్రీ

    నేటిపాఠ్య పుస్తకాల్లొ  చాటువుల్లో భాగంగా  పొడుపుకథలు చెర్చినట్టు,తన సిరిసిరి మువ్వ శతకంలో చాతువులు చేర్చాడు  శ్రీ శ్రీ  .
   ఈచాటువులు కూడాఛందోనియమాన్ని ,మకుటనియమాన్ని కలిగి శతక లక్షణాలతోనేఉన్నాయి
  
    కోయకుమీ సొరకాయలు
    వ్రాయకుమీ నవలలని అవాకు చెవాకుల్
    డాయకుమీ అరవ ఫిలిం
    చెయకుమీ చెబదుళ్ళు సిరిసిరి మువ్వా !

    బారెట్లా అయితే సాం
    బారెట్లా చెయ్యగలడు ?భార్యయెదుట తా
    నోరెట్లా మెదిలించును
    చీరెట్లా బేరమాడు ? సిరిసిరి మువ్వా ! లాంటి చాటువులు కనిపిస్తాయి .

చాటువులలోభాగంగా చివర ఫలశృతినికూడా చెప్పాడు
  
   ఈశతకం యెవరైనా
   చూసి,చదివి,వ్రాసి ,పాడి .సొగసిన  సిగరెట్
   వాసనలకు కొదవుండదు
   శ్రీశు కరుణ  బలిమివలన సిరిసిరి మువ్వా !



సిరిసిరి మువ్వా శతకంలోని రసం హాస్యరసం
  వికారోమానసొభావ:హాస:నిర్వచనం .వికారమనగా వ్యంగ్యం .వ్యక్తుల,నాయకుల చెష్టలను వ్యంగ్యంగా చూపడంద్వారా సిరిసిరి మువ్వ శతకం చదివే పాఠకుడు హాస్యరసాన్ని అనుభవిస్తాడు .కావున ఇందలిరసం  హాస్యం.

 ఇన్ని ప్రాచీన కావ్య లక్షణాలను ఇముడ్చుకొని వ్రాసిన శతకం ఆదునిక కాలంలోనేకాదు  ప్రాచినకాలంలోకూడాలేదేమో .
  

   శ్రి శ్రీ సిరిసిరి  మువ్వ శతకం పాత సేసాలో కొత్త  సారాయి వంటిది

Thursday, May 7, 2009

నాపేరు రవి చంద్ర .నేను మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల హైస్కూల్లో తెలుగు పండిత్ గాపని చేస్తున్నాను. .నాకు చిన్నప్పటినుండి మహా భారతమన్నా , జగన్నాటక సూత్రధారి శ్రీ కృష్ణుడు అన్నా ఏంటో అభిమానం .ఆ అభిమానం తో భారతం చదివేవాన్ని ,వినేవాన్ని .చూసేవాన్ని .
మహాభారతం లో నాకు కనిపించిన విశేషాలు వింతలు .నేనుచదివిన, విన్న విశేషాలు మీతో పంచుకోవాలని ఈనా చిన్న ప్రయత్నం .
విభుధజనులవలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతు